కృష్ణా పుష్కరాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
- August 10, 2016
శ్రావణశుద్ద నవమి శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కృష్ణవేణి పుష్కరాల పూర్తిస్థాయి ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తన అధికార నివాసంలో సమీక్షించారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లలగుండా ప్రవహిస్తున్న కృష్ణానది ఇటీవల వర్షాలకు పరవళ్లు తొక్కుతున్న నేపథ్యంలో పవిత్ర పుష్కరస్నానాలకు భక్తులు కోట్లాదిగా తరలిరానున్నారు. వరుస సెలవలు కారణంగా భక్తుల రద్దీ మరింత పెరగనున్నది. ఈ నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు మంత్రులు సీఎంకు వివరించారు. బుధవారం నాటి సమీక్షా సమావేశంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, అటవీ, బిసీ సంక్షేమ సఖ మంత్రి జోగు రామన్న, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, సంబీపూర్ రాజు, సిఎంఓ అధికారి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల సమయంలో భక్తులు కృష్ణానదిలో పూజలు, స్నానాలు, దాన ధర్మాలు, పితృ దేవతలకు పిండ ప్రధానాలు చేస్తే పుణ్యం కలుగుతుందని పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలనుండి కూడా భక్తులు తరలిరానున్నారు. ఆగష్టు 12న ప్రారంభమై పదకొండురోజుల పాటు కొనసాగి ఆగష్టు 23న కృష్ణా పుష్కరాల ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏర్పాట్లకు సంభందించి వివరాలు సేకరించడంతో పాటు సంభందిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పలు ప్రాజెక్టులు నిందుతున్న నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేయడంలో జాప్యం చేయవద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ లో ప్రారంభమైన మొదటి స్నాన ఘాట్ నుంచి నల్గొండలోని ఆఖరి పుష్కర ఘాట్ వరకు నది పొడవునా పుష్కలమైన నీరు ఇప్పటికే ప్రవహిస్తుండడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకోసం మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 81 పుష్కర స్నాన ఘాట్ల నిర్మాణం పనుల పై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









