షార్జ లో పని మనిషి ఘాతుకం అబార్షన్ ద్వారా 6 నెలల పిండాన్ని హతం
- August 10, 2016
షార్జ: ఆసియా ప్రాంతం లోని ఇండోనేషియా దేశానికి చెందిన ఓ పని మనిషి తన ఆరు నెలల పిండంని అబార్షన్ ద్వారా హతం చేసి అల్ బుహారహ్ ప్రాంతంలో ఒక తోట లో ఖననం చేసింది. ఈ శిశు హత్యకు మంగళవారం షార్జ క్రిమినల్ కోర్ట్ 2,000 డి హెచ్ జరిమానా తన బిడ్డని దారుణంగా చంపినందుకు జైలుశిక్ష సైతం విధించారు.ఆమె శిక్ష కాలం పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించి వేయాలని కోర్టు ఆదేశించింది.న్యాయవాదులు 'రికార్డు ప్రకారం ఈ ఇండోనేషియన్ పనిమనిషి ఒక పాకిస్తానీ వ్యక్తితో అక్రమ సంబంధం కల్గి ఉన్నట్లు పేర్కొంది. ఆమె అక్రమ శిశువుని చంపడంలో ఆ మహిళా ఆవేశం ప్రదర్శించిందని ఆరోపించింది..శిశువుని హతమార్చిన సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 25 న జరిగింది. అల్ నూర్ మసీదు వద్ద తాటి చెట్ల మధ్య ఖననం చేసింది తోట శుభ్రం చేసేందుకు వచ్చిన ఒక పురపాలక కార్మికుడు పసిగుడ్డు మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీనితో విచారణ చేసిన వారికి ఈ పనిమనిషి వ్యవహారం వెలుగులోనికి వచ్చింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









