కోలీవుడ్కు శుభవార్త!
- August 12, 2016
కోలీవుడ్కు శుభవార్త! త్వరలోనే సినీ పరిశ్రమకు ప్రభుత్వ అవార్డులు అందనున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే, నటుడు వైగై చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా సినీపరిశ్రమకు ప్రభుత్వ అవార్డులు లేకుండాపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలోకి జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... త్వరలోనే భారీగా ఉత్సవం నిర్వహించి సినీ పరిశ్రమకు ఆరేళ్లకు సంబంధించిన అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. నటీనటులతో పాటు, టెక్నీషియన్లకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. అంతేగాక బుల్లితెర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కూడా అవార్డులు ఇస్తామన్నారు. గత డీఎంకే ప్రభుత్వం మూడేళ్లపాటు పోలీసులకు అవార్డులు ఇవ్వకుండా నిలిపేసిందని విమర్శిస్తూ.. తాను అధికారంలోకి రాగానే పోలీసుశాఖకు మెడల్స్ బహూకరించానన్నారు. తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని సీఎం వివరించారు. అమ్మా! కృతజ్ఞతలు: నడిగర్ సంఘం సినీ పరిశ్రమకు త్వరలోనే అవార్డులు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జయలలితకు నడిగర్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, ఉపాధ్యక్షుడు పొనవన్నన శుక్రవారం సాయంత్రం నగరంలో విలేఖరులతో మాట్లాడుతూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సంఘం కోసం నిర్మితమవుతున్న భవనాన్ని ప్రారంభించబోతున్నారని, అదే విధంగా ఇప్పుడు అవార్డులు ప్రకటించినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









