పొల్యూషన్ రూల్స్ని అతిక్రమించిన 60 సంస్థలకు వార్నింగ్
- August 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్కి చెందిన ఇండస్ట్రియల్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్, 60 కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. పొల్యూషన్ నిబందనల్ని అతిక్రమిస్తున్నట్లు ఈ హెచ్చరికల్లో పేర్కొన్నారు. ఏడాదికి రెండుసార్లు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. కార్బన్ ఎమిషన్స్ ఏ స్థాయిలో గాల్లోకి విడిచపెట్టబడుతున్నాయో ఈ తనిఖీల్లో పరిశీలించి, నిబందనల్ని అతిక్రమించేవారికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇంకో వైపున ఈ ఏడాది తొలి క్వార్టర్లో 190 అనుమతుల్ని మంజూరు చేశారు. గత ఏడాది 600 అనుమతుల్ని మంజూరు చేశారు. చిన్న కంపెనీల విషయానికొస్తే, అంతర్గతంగా పరిస్థితుల్ని మాత్రమే పరిశీలిస్తామనీ, ఒక్కోసారి మిగతా అంశాల్నీ తనిఖీల్లో పరిశీలిస్తామని డైరెక్టర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అలి అబ్దుల్లా అల్ మర్రి చెప్పారు. 700 చిన్నస్థాయి కంపెనీలలో ఏడాదికి రెండుసార్లు ఖచ్చితంగా తనిఖీలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. అలాగే ప్రత్యేక తనిఖీలు కూడా అప్పుడప్పుడూ జరుగుతంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







