ఇండియన్‌ ఎంబసీలో ఆగస్ట్‌ 15న జెండావందనం

- August 13, 2016 , by Maagulf
ఇండియన్‌ ఎంబసీలో ఆగస్ట్‌ 15న జెండావందనం

70వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆగస్ట్‌ 15న ఉదయం 7 గంటల సమయంలో ఇండియన్‌ ఎంబసీ పరిసరాల్లో జెండా వందన కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని ప్రెస్‌ రిలీజ్‌ ద్వారా ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా బహ్రెయిన్‌ కేరలీయ సమాజం భవనంలో సాంస్కృతిక కార్యక్రమాల్ని సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారు. భారతదేశానికి చెందినవారంతా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని, కుటుంబ సమేతంగా హాజరు కావొచ్చని ఇండియా ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. ఆగస్ట్‌ 15న ఇండియన్‌ ఎంబసీకి సెలవుదినం అని కూడా పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com