అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు - శిద్దా రాఘవరావు

- August 13, 2016 , by Maagulf
అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు - శిద్దా రాఘవరావు

కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చే యాత్రికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తప్పవని ఏపీ రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు హెచ్చరించారు. ట్రావెల్స్‌ దోపిడీని నివారించేలా దాడులు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19, 20 తేదీల్లో రోడ్డు భద్రతపై విశాఖలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. రోడ్డు భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com