హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- July 25, 2026
పశ్చిమాసియాలోని గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించే హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తున్న ఒక ఎల్పీజీ (LPG) ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మొజాంబిక్ జెండాతో ప్రయాణిస్తున్న ‘దిశ’ అనే ఈ నౌకలో మొత్తం 28 మంది భారతీయ నావికులు సిబ్బందిగా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదకర దాడి నుంచి భారతీయ సిబ్బంది అందరూ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నౌకలోని నావికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
తక్షణమే స్పందించిన భారత రాయబార కార్యాలయం
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఇరాన్లోని భారత ఎంబసీ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక ఇరాన్ ప్రభుత్వ అధికారులతో ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుపుతూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. నావికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు దౌత్యపరమైన చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
అమెరికా హెచ్చరికలు.. ఆపై ఊహించని డిస్ట్రెస్ కాల్
ఈ దాడి వెనుక ఆసక్తికరమైన మరియు కలవరపెట్టే పరిణామాలు చోటుచేసుకున్నట్లు విదేశీ రేడియో కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా మిలిటరీ ఆపరేటర్లు సదరు నౌకను ఇరాన్ జలాల వైపు వెళ్లవద్దని, ఒకవేళ ఆ దిశగా వెళ్తే నౌక ఇంజిన్ రూమ్పై దాడి చేస్తామని హెచ్చరించినట్లు చెబుతున్న ఆడియో రికార్డింగ్లు బయటపడటం గమనాార్హం. ఈ హెచ్చరికలు ముగిసిన కొద్దిసేపటికే.. తమ నౌకపై గుర్తుతెలియని క్షిపణులు పడ్డాయని, అత్యవసరంగా రక్షణ సహాయం కావాలంటూ ‘దిశ’ నౌక నుంచి ‘డిస్ట్రెస్ కాల్’ (Distress Call) రావడం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది.
ముందే హెచ్చరించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మేరిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA)
మధ్యప్రాచ్యంలో రాజుకుంటున్న ఉద్రిక్తతల తీవ్రతను ముందే గ్రహించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మేరిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల్లో ఏ ఒక్క భారతీయ సీఫేరర్ను (నావికుడిని) నియమించవద్దని నౌకాయాన సంస్థలను ఇటీవలే హెచ్చరించింది. భారతీయ నావికుల రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ లోపే ఈ క్షిపణి దాడి జరగడం మేరిటైమ్ రంగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!







