కిడ్నాప్ చేసిన 2 సంవత్సరాల తర్వాత వీడియో రిలీజ్ చేసిన తీవ్రవాదులు
- August 14, 2016
ఉగ్రవాదుల బెడద ఏ ఒక్క దేశానికో పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద బాధిత దేశాలే. వివిధ సంస్థల పేర్లతో బయటకు వస్తున్న ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. ఇక ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా విషయానికొస్తే బోకో హరామ్ తీవ్రవాదులు ఆ దేశాన్ని గడగడలాడిస్తున్నారు. ఏప్రిల్ 2014 లో ఓ స్కూలు నుంచి చిబోకి బాలికలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ఉగ్రవాదులు సరిగ్గా 852 రోజుల తర్వాత ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలికలను తిరిగి క్షేమంగా అప్పగించాలంటే ప్రభుత్వం చెరలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 50 మంది వరకు అమ్మాయిలు హిజాబ్లు ధరించి వీడియోలో కనిపిస్తున్నారు. ఓ ఉగ్రవాది వారితో సైతం మాట్లాడించాడు. ఈ సందర్భంగా ఓ బాలిక మాట్లాడుతూ నైజీరియన్ ఎయిర్ఫోర్స్ దాడుల్లో తమతోపాటు కిడ్నాపైన వారిలో డజన్ల కొద్దీ అమ్మాయిలు కళ్లముందే ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పింది. అంతేకాదు వాయుదాడుల్లో మరణించిన అమ్మాయిలను కూడా వీడియోలో చూపించారు. ఈ బాలికలను విడిచిపెట్టాలంటే తక్షణమే పోలీసుల చెరలో ఉన్న తమ వారిని విడిచిపెట్టాలని అధ్యక్షుడు ముహమ్మదు బుహారి నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వాన్ని బోకోహరామ్ తీవ్రవాదులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







