పక్షిని 'ఢీ' కొట్టడంతో కతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్

- August 19, 2016 , by Maagulf
పక్షిని 'ఢీ' కొట్టడంతో కతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్

దోహా , ఇస్తాంబుల్ : తిమింగలం అంత సైజు ఉన్న పెద్ద విమానం ఓ బుల్లి పిట్ట దెబ్బకు అల్లాడిపోయింది . అర్ధాంతరంగా ఆకాశం నుంచి భూమి మీదకు గజ గజ వణుకుతూ దిగిపోయింది.  వివరాలలోనికి వెళితే,    కతర్ ఎయిర్వేస్  ప్రయాణీకుల విమానం దాని ఇంజిన్లలో  , ఒక దానిలో  అగ్ని రాజుకొని ఉందని   ఏవియేషన్ అధికారులు  మరియు క్యారియర్  తెలిపారు. దీనికి కారణం ఒక అనుమానిత పక్షి  ప్రోఫిల్లెర్ ఇంజన్ లోనికి వెళ్లి ఆహుతై ఆపై మంటలు రగిల్చింది. దీనితో భయపడిపోయిన విమాన సిబ్బంది  ఇస్తాంబుల్ లోని  అతాతుర్క్  విమానాశ్రయం గురువారం అత్యవసరంగా విమానంని  దించివేయాల్సివచ్చింది. 

దోహా కు  ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు  మరియు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కతార్ ఎయిర్వేస్ అధికారులు తెలిపారు. దోహా నుండి బుదపేస్ట్ వెళుతున్న క్యూ ఆర్  240 విమానం  298 మంది ప్రయాణికులు మరియు 14 మంది సిబ్బందితో సహా  ఇస్తాంబుల్ లోని  అతాతుర్క్ విమానాశ్రాయంలో  సురక్షితంగా  ల్యాండ్ కాబడినట్లు  నిర్ధారిస్తూ  కతర్  ఎయిర్వేస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com