ఆన్లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు...
- August 21, 2016
ఆన్లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు పొందడం, రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పుదుచ్చేరిలో ప్రవేశపెట్టారు. దేశంలోని అన్నిరకాల ఆయుధాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్లైన్లో లెసైన్సులివ్వాలని కేంద్ర హోం శాఖ గతంలో ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు పోలీసు, న్యాయ శాఖల అధికారులు, న్యాయమూర్తులు శనివారం పుదుచ్చేరి సచివాలయంలో సమావేశమయ్యారు.అక్కడే సచివాలయ కార్యదర్శి మనోజ్ పరిదా ఆన్లైన్లో లెసైన్సలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎక్కడైనా నేరాలు జరిగినచోట తుపాకీ దొరికితే, దానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య ద్వారా తుపాకీ ఎవ రిదో ఆన్లైన్లో సులువుగా తెలుసుకోవచ్చు.
కార్యక్రమంలో డీజీపీ సునీల్కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









