ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఐఎస్లో..
- August 21, 2016
కేరళ నుంచి ఇటీవల అదృశ్యమైన పది మంది వ్యక్తులు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్లో చేరినట్టు అనుమానాలు బలపడుతుండగా, వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారనే సంచలన విషయం వెలుగుచూసింది. ఆ ఐదుగురు కూడా ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుటుంబీకులుగా తెలుస్తోంది. ముంబై వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ ఇటీవల తన భార్య, కుమార్తెను తీసుకుని పశ్చిమ ఆసియాకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు సోదరులు అష్ఫాక్తో కలిసినట్టు ఒక వార్తా కథనం బయటకు వచ్చింది. 26 ఏళ్ల అష్ఫాక్ తన భార్య, కుమార్తె, సోదరులు మహ్మద్ సిరాజ్, ఇజాజ్ రెహ్మాన్లతో కలిసి ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు జూన్లో ఇండియా విడిచి వెళ్లాడని తెలిసింది.అష్ఫాక్ సోదరులలో ఒకడైన మహ్మద్ సిరాజ్ వ్యాపారవేత్త కాగా, మరో సోదరుడు ఇజాజ్ మెడికల్ ప్రాక్టీషియనర్. అష్ఫాక్ తన చిన్న తమ్ముడికి జూన్లో మొబైల్ సందేశం పంపాడు. అందులో తాను ఐఎస్లో చేరానని, వెనక్కి రావాలనుకోవడం లేదని, తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండమని తన సోదరుడికి అష్ఫాక్ సూచించాడు. కాగా, తన కుమారుడు ఐఎస్లో చేరడానికి ఒక మతబోధకుడితో సహా పలువురు కారణమని ఆరోపిస్తూ అష్ఫాక్ తండ్రి అబ్దుల్ మజాద్ ఈనెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు మహ్మద్ హనీఫ్ అనే ఇస్లాం మంతబోధకుడికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









