ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఐఎస్లో..
- August 21, 2016
కేరళ నుంచి ఇటీవల అదృశ్యమైన పది మంది వ్యక్తులు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్లో చేరినట్టు అనుమానాలు బలపడుతుండగా, వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారనే సంచలన విషయం వెలుగుచూసింది. ఆ ఐదుగురు కూడా ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుటుంబీకులుగా తెలుస్తోంది. ముంబై వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ ఇటీవల తన భార్య, కుమార్తెను తీసుకుని పశ్చిమ ఆసియాకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు సోదరులు అష్ఫాక్తో కలిసినట్టు ఒక వార్తా కథనం బయటకు వచ్చింది. 26 ఏళ్ల అష్ఫాక్ తన భార్య, కుమార్తె, సోదరులు మహ్మద్ సిరాజ్, ఇజాజ్ రెహ్మాన్లతో కలిసి ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు జూన్లో ఇండియా విడిచి వెళ్లాడని తెలిసింది.అష్ఫాక్ సోదరులలో ఒకడైన మహ్మద్ సిరాజ్ వ్యాపారవేత్త కాగా, మరో సోదరుడు ఇజాజ్ మెడికల్ ప్రాక్టీషియనర్. అష్ఫాక్ తన చిన్న తమ్ముడికి జూన్లో మొబైల్ సందేశం పంపాడు. అందులో తాను ఐఎస్లో చేరానని, వెనక్కి రావాలనుకోవడం లేదని, తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండమని తన సోదరుడికి అష్ఫాక్ సూచించాడు. కాగా, తన కుమారుడు ఐఎస్లో చేరడానికి ఒక మతబోధకుడితో సహా పలువురు కారణమని ఆరోపిస్తూ అష్ఫాక్ తండ్రి అబ్దుల్ మజాద్ ఈనెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు మహ్మద్ హనీఫ్ అనే ఇస్లాం మంతబోధకుడికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









