హజ్ యాత్రకు వెళ్లే సోదరులకు తెలంగాణ ప్రభుత్వం మెరుగైన సేవలు
- August 21, 2016
తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే మైనారి టీ సోదరులకు మెరుగైన సేవలు అంది స్తోందని డీప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. మొదటి సారిగా హజ్ యాత్రకు బయలుదేరుతున్న ముస్లింసో దరుల యాత్రను ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. నగరం లోని నాపంల్లి హజ్హౌజ్ నుంచి ప్రత్యే క బస్సులు ఏర్పాటు చేసి శంషాబాద్ ఎయిర్ పోర్టులోని హజ్ టర్మినల్కు చే ర్చారు. ఈ సందర్భంగా ఆయన విమా నాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ కల్పిం చని సౌకార్యాలు తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. అలాగే సౌదీలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అక్కడి ప్రభుత్వంతో సంప్ర దింపులు జరుపుతున్నామని తెలిపారు.మైనారి టీల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. హజ్యాత్ర మొదటి బ్యాచ్లో 45 మంది ముస్లింలు ఎయిర్ఇం డియా విమానంలో బయలుదేరి వెళ్లారు. వీరు 45 రోజుల తరువాత తిరిగి ఇండియా చేరు కుంటారని మంత్రి చెప్పారు. అంతకు ముందు హజ్ టర్నినల్ వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పరిశీలించారు.
ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకిల్ అమేర్, డిప్యూటీ మేయర్ బాబా ఫిసీయుద్దీన, హజ్ కమిటీ మెంబర్స్ మహబూబ్, జాఫర్, మేరాజ్, ఫరూక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!









