విమానంలో మరణించిన భారతీయని భౌతికకాయం నేడు స్వదేశానికి

- August 21, 2016 , by Maagulf
విమానంలో మరణించిన భారతీయని భౌతికకాయం నేడు  స్వదేశానికి

దోహా:  కతర్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణిస్తూ ఆకాశం మధ్యలో అకస్మాత్ముగా  మరణించిన భారతీయ వ్యక్తి యొక్క పార్ధీవదేహం సోమవారం సాయంత్రం ఆయన స్వదేశం లోని  హైదరాబాద్ కు  చేర్చబడుతుందని ఈ కార్యక్రమానికి పూనుకొన్న సామాజికవర్గాలు పేర్కొన్నాయి. ఆగష్టు 15 వ తేదీన తుమ్మల  ప్రేమ్ ప్రసాద్  తన భార్యతో వాషింగ్టన్ డి.సి. నుండి  వయ దోహా మీదుగా విమానంలో ప్రయాణిస్తూ తీవ్రమైన గుండె పోటుకు గురై మరణించారు. తుమ్మల ప్రేమ్ ప్రసాద్ తన భార్య అరుణతో కలిసి వారి పిల్లల వద్ద ఆరునెలల పాటు సెలవలు గడిపిన తర్వాత ఆగస్టు 14 వ తేదీ  కతార్ ఎయిర్వేస్ విమాన క్యూఆర్ 708 విమానంలో వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ  విమానాశ్రయం నుంచి   హైదరాబాద్ లోని తమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యేందుకు విమానమెక్కారు. తుమ్మల  ప్రేమ్ ప్రసాద్   సజీవంగా కన్న బిడ్డల వద్దకు సంతోషంతో  వెళ్లిన ప్రేమ్ ప్రసాద్ ఆరునెలల తర్వాత నిర్జీవంగా తన స్వగృహానికి చేరుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com