సింధుకు హైదరాబాద్లో అడుగడుగునా నీరాజనాలు...
- August 22, 2016
ఒలింపిక్స్లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు హైదరాబాద్లో అడుగడుగునా నీరాజనాలు. అసమాన ప్రతిభతో పతకం తెచ్చిపెట్టిన ఫస్ట్ భారతీయ యువతిగా చరిత్ర సృష్టించింది ఆమె. సొంతరాష్ర్టం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. సింధు, కోచ్ గోపీచంద్లను తెలంగాణ మంత్రి కేటీఆర్తోపాటు ఏపీ మంత్రులు, అధికారులు, ఫ్యామిలీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో పుష్పగుచ్చాలిచ్చి సింధును సాదరంగా ఆహ్వానించారు. అక్కడనుంచి ఓపెన్ టాప్ వాహనంపై విజయోత్సవ ర్యాలీ సాగింది.శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ ర్యాలీని సాగింది. అనంతరం అక్కడి స్టేడియం అంతా తిరిగారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్.. సిందు, కోచ్ గోపిచంద్లను సన్మానించనున్నారు. మరోవైపు పతకం సాధించిన తర్వాత సింధు తొలిసారి నగరానికి రానున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో హోర్డింగ్లు వెలిశాయి.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







