సరికొత్త సాంకేతిక హంగులతో స్కూల్ బస్సులు
- August 22, 2016
ఆర్టిఎకి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) 2016-17 సంవత్సరానికిగాను విద్యార్థుల కోసం సరికొత్త సాంకేతిక హంగులతో కూడిన స్కూల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సుల్లో విద్యార్థుల భద్రత కోసం అనేక ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని డిటిసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్ అప్ చేశారు. దాంతో బస్సులో ఏం జరుగుతోందో కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేయడానికి వీలుంటుంది. అలాగే బస్సుల్ని జిపిఎస్తో అనుసంధానం చేశారు. తద్వారా డిటిసి కంట్రోల్ సెంటర్కే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే స్కూల్ యాజమాన్యాలకీ బస్సుల వివరాలు తెలుస్తాయి. బస్సు సర్వీసులు అవసరమైన స్కూల్స్, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్కూలు బస్సుల ప్రమాదాల్ని నివారించేందుకే ఈ కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని బస్సుల్లో వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







