పెరిగిన పసిడి,వెండి ధరలు

- August 23, 2016 , by Maagulf
పెరిగిన పసిడి,వెండి ధరలు

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో వరుసగా నాలుగు రోజులు తగ్గుముఖం పట్టిన వెండి ధర నేడు కాస్త పెరిగింది. రూ. 200 పెరగడంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,400గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.
బంగారం కూడా నేడు వెండి దారిలోనే పయనించింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో రూ. 150 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 31,200కు చేరింది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com