వేసవి దెబ్బల్ని నివారించేందుకు చర్యలు
- August 23, 2016
వేసవి కాలంలో తగిలే దెబ్బల్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టింది మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంఓపిహెచ్). మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ, ఖతార్ రెడ్ క్రిసెంట్ సొసైటీలతో కలిసి సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వేసవి మండుటెండల్లో సూర్యరశ్మి తగిలే చోట కార్మికులు పనిచేయకుండా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వేసవి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, కార్మికుల భద్రతపై ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడరాదని ఈ సందర్బంగా సమావేశంలో ప్రముఖులు తీర్మానించారు. ఉదయం 11.30 గంటల సమయం లోపు తొలి షిఫ్ట్ పని పూర్తి చేయాలని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదు గంటలకు మించి ఉండరాదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సాయంత్రం షిఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ 3 గంటలకు ముందు ఉండరాదని తేల్చారు. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. నిబంధనల్ని అతిక్రమించిన 60 కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









