అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది..
- August 24, 2016
విస్తరిస్తున్న దావానలం..ఊళ్లకు ఊళ్లు ఖాళీచేస్తున్న జనంలాస్ ఏంజిలెస్, అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది. అడవుల్లో పుట్టిన కార్చిచ్చు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఆస్తులను బుగ్గిచేస్తోంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతో జనం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ రాష్ట్రం 20 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తున్నట్లు గవర్నర్ జే ఇన్స్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దావానలం ఇప్పటివకు గ్రామీణ ప్రాంతాల్లోని 25 భవనాలను నాశనం చేసిందని, వందల భవనాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. చెర్రీ రోడ్లో కార్చిచ్చుకు 31,660 ఎకరాలు, కహ్లోట్సలో 20 వేల ఎకరాలు బూడిదయ్యాయి. ఇక్కడ మంటలను అదుపుచేయడం కుదరడం లేదు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









