అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది..

- August 24, 2016 , by Maagulf
అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది..

విస్తరిస్తున్న దావానలం..ఊళ్లకు ఊళ్లు ఖాళీచేస్తున్న జనంలాస్‌ ఏంజిలెస్‌, అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది. అడవుల్లో పుట్టిన కార్చిచ్చు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఆస్తులను బుగ్గిచేస్తోంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతో జనం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్‌ రాష్ట్రం 20 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తున్నట్లు గవర్నర్‌ జే ఇన్‌స్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దావానలం ఇప్పటివకు గ్రామీణ ప్రాంతాల్లోని 25 భవనాలను నాశనం చేసిందని, వందల భవనాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. చెర్రీ రోడ్‌లో కార్చిచ్చుకు 31,660 ఎకరాలు, కహ్లోట్‌సలో 20 వేల ఎకరాలు బూడిదయ్యాయి. ఇక్కడ మంటలను అదుపుచేయడం కుదరడం లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com