అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది..
- August 24, 2016
విస్తరిస్తున్న దావానలం..ఊళ్లకు ఊళ్లు ఖాళీచేస్తున్న జనంలాస్ ఏంజిలెస్, అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది. అడవుల్లో పుట్టిన కార్చిచ్చు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఆస్తులను బుగ్గిచేస్తోంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతో జనం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ రాష్ట్రం 20 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తున్నట్లు గవర్నర్ జే ఇన్స్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దావానలం ఇప్పటివకు గ్రామీణ ప్రాంతాల్లోని 25 భవనాలను నాశనం చేసిందని, వందల భవనాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. చెర్రీ రోడ్లో కార్చిచ్చుకు 31,660 ఎకరాలు, కహ్లోట్సలో 20 వేల ఎకరాలు బూడిదయ్యాయి. ఇక్కడ మంటలను అదుపుచేయడం కుదరడం లేదు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







