'దువ్వాడ జగన్నాథమ్'గా అల్లు అర్జున్
- August 28, 2016
'సరైనోడు'గా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్(డీజే)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర లోగోను చిత్ర బృందం ఆదివారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టైటిట్ అదిరింది.. డీజే రాకింగ్.. అంటూ దేవీశ్రీ ప్రసాద్ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రేపటినుంచి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బన్నీతో చిత్రం చేయబోతున్నాను.. దర్శకుడు హరీశ్ అర్జున్ ఇమేజ్ తగిన స్క్రిప్టును సిద్ధం చేసినట్లు తెలిపారు. దిల్ రాజు, బన్నీ కాంబినేషనల్లో వచ్చిన 'ఆర్య', 'పరుగు' చిత్రాలు మంచి హిట్ సాధించాయి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









