'దువ్వాడ జగన్నాథమ్‌'గా అల్లు అర్జున్

- August 28, 2016 , by Maagulf
'దువ్వాడ జగన్నాథమ్‌'గా అల్లు అర్జున్

'సరైనోడు'గా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్‌(డీజే)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర లోగోను చిత్ర బృందం ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టైటిట్‌ అదిరింది.. డీజే రాకింగ్‌.. అంటూ దేవీశ్రీ ప్రసాద్‌ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ చిత్రానికి రాకింగ్‌ స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ రేపటినుంచి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దిల్‌ రాజు మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బన్నీతో చిత్రం చేయబోతున్నాను.. దర్శకుడు హరీశ్‌ అర్జున్‌ ఇమేజ్‌ తగిన స్క్రిప్టును సిద్ధం చేసినట్లు తెలిపారు. దిల్‌ రాజు, బన్నీ కాంబినేషనల్‌లో వచ్చిన 'ఆర్య', 'పరుగు' చిత్రాలు మంచి హిట్‌ సాధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com