ప్రధానిని కలిసిన సింధు, సాక్షి మాలిక్
- August 28, 2016
రియో ఒలింపిక్స్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్తో పాటు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మకార్, ఇతర క్రీడాకారులు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం ప్రధాని మోదీ అధికార నివాసానికి వీరు వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా సింధు, సాక్షి, గోపీచంద్, దీపలను ప్రత్యేకంగా అభినందించారు. సింధు, సాక్షి, దీపలతో ఇటీవల జాతీయ అవార్డులకు ఎంపికైన క్రీడాకారులను మోదీ సత్కరించారు.
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో తెలుగుతేజం సింధు రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సింధుకు కోచ్గా గోపీచంద్ వ్యవహరించాడు. జిమ్నాస్ట్ దీపా కర్మకార్ రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేసింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









