లిబియాలో తెలుగు వారిని కిడ్నాప్

- July 31, 2015 , by Maagulf
లిబియాలో తెలుగు వారిని కిడ్నాప్

లిబియాలో అపహణకు గురైన వారిలో ముగ్గురు కర్నాటక వాసులు, ఒకరు తెలంగాణవారిగా తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు హైదరాబాద్ వాసులు అని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. లిబియాలో నలుగురు భారతీయులు కిడ్నాప్‌కు గురయ్యారని, అందులో ఇద్దరు కర్నాటకవాసులు, ఇద్దరు హైదరాబాద్ వారు ఉన్నారని చెప్పారు. వారిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నాపైన తెలుగువారిలో గోపీకృష్ణ, బలరామ్ ఉన్నారు. బలరాం శ్రీకాకుళం జిల్లా టెక్కలివాసి. కాగా, గోపీకృష్ణ హైదరాబాదుకు చెందిన వారు. కర్నాటకకు చెందిన ఇద్దరి పేర్లు... లక్ష్మీకాంత్, విజయ్ కుమార్‌లుగా తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com