విశాల్ కథానాయకుడుగా 'ఒక్కడొచ్చాడు'
- August 29, 2016
ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ఓ వ్యక్తి నిత్యం ప్రశ్నిస్తూ ఉంటాడు. వాళ్లకు ఏ అన్యాయం జరిగినా తానున్నానంటూ ముందుకొస్తాడు. ఆ కథను 'ఒక్కడొచ్చాడు' టైటిల్తో విశాల్ కథానాయకుడుగా చేస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉంటూనే ఒక పవర్ఫుల్, పర్పస్ఫుల్ ఫిలింగా రూపొందుతోంది. సురాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత జి.హరి సోమవారం ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. హీరోయిన్ తమన్నాకి మరో హీరోయిన్ శ్రుతిహాసన్ పాట పాడడం మరో విశేషం.ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ '' దర్శకుడు ఈ స్టోరీ లైన్ చెప్పగానే అన్ని సినిమాలూ ఆపేసి ఇదే చేయాలని డిసైడ్ అయ్యాను.
అంతగా ఈ కథకు నేను కనెక్ట్ అయ్యాను. ఇందులో ఒక కొత్త పాయింట్ ఉంది. అది అన్ని ఊళ్ళల్లో అందరూ నిత్యం ఎదుర్కొనేదే. ఆ పాయింట్ చుట్టూ అల్లిన మంచి కమర్షియల్ సినిమా ఇది.
ఇందులో నా లుక్, క్యారెక్టరైజేషన్ ఇంతకుముందు సినిమాలన్నింటి కంటే డిఫరెంట్గా ఉంటుంది. జగపతిబాబు ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు. తరుణ్ అరోరా విలన్గా నటిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
అలాగే సెప్టెంబర్ 12 నుండి మిస్కిన్ డైరెక్షన్లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మరో చిత్రం ప్రారంభిస్తున్నాం' అని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







