ఎగ్ రోల్స్
- August 29, 2016
కావలసినవి : మైదా - ఒక కప్పు, నీళ్లు, ఉప్పు - తగినంత, కోడిగుడ్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి(సన్నగా తరిగి), కీరదోసకాయ - ఒకటి (సన్నగా, నిలువుగా), పచ్చి మిర్చి - రెండు(సన్నగా తరిగి), నూనె - వేగించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా, టొమాటొ సాస్ - కొద్దిగా.
తయారీ : నీళ్లుపోసి మైదాపిండిని ముద్దలా కలిపి పరాఠాలు చేయాలి. ఒక గిన్నెలో కోడిగుడ్డును పగుల కొట్టి చిటికెడు ఉప్పు కలపాలి. పాన్లో ఒకటేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో కోడిగుడ్డు మిశ్రమం వేసి పరాఠా ఎంత సైజులో ఉంటే ఆ సైజులో వచ్చే విధంగా ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ సగం ఉడికాక పరాఠాను దానిమీద పెట్టి రెండు నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత పరాఠాను తిప్పి కాసేపు ఉంచి బయటకు తీయాలి. ఆమ్లెట్ ఉన్నవైపు పైకి ఉంచి అందులో కీర దోసకాయ, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిపైన టొమాటో సాస్ వేసి రోల్ చేయాలి. పైన నిమ్మరసం చల్లుకుని తింటే యమ్మీ యమ్మీగా ఉంటాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







