సెప్టెంబర్‌ 30న పేలనున్న ఎన్‌ఆర్‌ఐ ట్యాక్స్‌ బాంబ్‌

- August 30, 2016 , by Maagulf
సెప్టెంబర్‌ 30న పేలనున్న ఎన్‌ఆర్‌ఐ ట్యాక్స్‌ బాంబ్‌

నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌, ఇండియాలోని తమ ఆస్తుల వివరాల వెల్లడికి సెప్టెంబర్‌ 30వ తేదీ డెడ్‌లైన్‌. ఈ తేదీ తర్వాత ఇండియాలోని ఆస్తులకుగాను ఎన్‌ఆర్‌ఐలు ట్యాక్స్‌ పే చేయాల్సి ఉంటుంది. ఇండియాలో పెట్టే పెట్టుబడులకు సంబంధించి పూర్తిస్తాయిలో వెరిఫై చేసుకోవాల్సిందిగా న్యూ ఇంకమ్‌ డిక్లరేషన్‌ స్కీమ్‌ 2016 తెరపైకి వచ్చింది. భారత ఆదాయపు పన్ను శాఖ తెరపైకి తెచ్చిన 2016 ఐడిఎస్‌ స్కీమ్‌ ద్వారా, ఇప్పటి వరకూ పూర్తిగా పన్నులు చెల్లించనివారు ఇకపై పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా సరే తమ ఆస్తుల వివరాల్ని గోప్యంగా ఉంచినట్లయితే అది భవిష్యత్తులో పెద్ద బాంబ్‌ బ్లాస్ట్‌లా మారిపోతుందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. నవంబర్‌ 30 లోపు వివరాల్ని తెలియజేసేవారికి ఎలాంటి పెనాల్టీ ఉండదనీ, ఆ తేదీ తర్వాత వివరాలు వెల్లడించినా పెనాల్టీ భారీగా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ప్రకటించని ఆస్తులపై 45 శాతం ట్యాక్స్‌ని పే చేయాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com