తాజ్ మహల్ సమీపంలో విమానాశ్రయం
- September 05, 2016
ప్రేమమందిరానికి ప్రతీకగా నిలిచిన తాజ్మహల్ అందాలను వీక్షించేందుకు ఇప్పటి వరకు రోడ్డు.. రైలు మార్గాలనే పర్యాటకులు ఆశ్రయించారు. ఇక నుంచి విమాన సదుపాయాన్ని కల్పించనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజ్మహల్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.100కోట్ల వ్యయంతో రన్వేను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే రన్వేకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. .
వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు ప్రారంభిస్తామని. దీనికి సంబంధించిన స్థలాన్ని ముందే పర్యవేక్షించామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్ వెల్లడించారు. పర్యాటకులు దిల్లీకి వచ్చి అక్కడి నుంచి రోడ్డు.. రైలు మార్గాల ద్వారా ఆగ్రా చేరుకుంటున్నారని పర్యాటకశాఖ పేర్కొంది. తాజ్ అందాలను వీక్షించేందుకు భారత్ నుంచి 65లక్షల మంది పర్యాటకులు వస్తుండగా. ఏడు లక్షల మంది విదేశీయులు వస్తుంటారు. కాని ఆగ్రాలో తాజ్మహల్తో పాటు ఆగ్రా కోట, ఫతేఫూర్ సిక్రీ ఉన్నాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









