కొత్త జిల్లాలకు నిధులు మంజూరు చేసిన కె.సి.ఆర్
- September 06, 2016
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న జిల్లాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ లో మంగళవారం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
17 కొత్త జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటిన్నర చొప్పున నిధులు ప్రకటించారు. వీటితో పాటు కలెక్టరేట్ ఏర్పాటుకు రూ.కోటి, పోలీస్ కార్యాలయం ఏర్పాటుకు రూ.50 లక్షల చొప్పున నిధులను మంజూరు చేశారు. కొత్త జిల్లాల్లో పనిభారం లేకుండా ఉండేందుకు శాఖల కుదింపు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. ఒకే పనితీరు కలిగిన శాఖలన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









