పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..
- September 07, 2016
మరికొద్దిగంటల్లో రియో డిజనీరోలోని మారకానా స్టేడియంలో పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. వికలాంగులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రియో 2016 పారా ఒలింపిక్స్ పోటీలను ఈ సారి ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 154 దేశాల్లో ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ వెల్లడించింది. టీవీ, రేడియో, ఆన్లైన్ ద్వారా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని కమిటీ సిబ్బంది తెలిపారు.2012 లండన్ పారాలింపిక్ గేమ్స్ను 115దేశాల్లో ప్రసారం చేయగా ఈసారి 30శాతంపైగా పెంచినట్లు తెలిపారు. 2012లో 3.8బిలియన్ల మంది ఈ ప్రసారాలను వీక్షించగా..ఈ సారి వారి సంఖ్య 4బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పారాలింపిక్స్ ఈ నెల 7 నుంచి 18 వరకు జరగనున్నాయి. మన దేశం తరఫున 15మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









