రాష్ట్రం నలుమూలలకు ఐటీ శాఖ..
- September 07, 2016
తెలంగాణాలో ఐటీ అంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఒక్కటే కాదని రాష్ట్రం నలుమూలలకు ఈరంగం విస్తరించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్మిన మంత్రి కేటీఆర్. ఆ దిశగా చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఐటీ శాఖ పరిధిలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన రూరల్ టెక్ పాలసీ ద్వారా ఇప్పటికే మూడు జిల్లాల్లో నాలుగు ప్రఖ్యాత కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని జిల్లాల్లో కంపెనీలు స్థాపించేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. పల్లె ప్రాంతాలకు సాంకేతిక కొలువులు తీసుకువెళ్ళాలన్నది కేటీఆర్ లక్ష్యం. దీనికి సంబంధించి ప్రత్యేక ఉపపాలసీని కూడా ప్రకటించారు. ఇన్ఫోటెక్ వరంగల్లో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా 1800 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే కరీంనగర్ జిల్లాలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, హుజూరాబాద్ లో తెలెకా నెట్ వర్కింగ్ టెక్నాలజీస్ ను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 260 మందికి ఉపాధి దక్కనుంది. మరోవైపు నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన శాండ్ బాక్స్ మరింద వినూత్నంగా పనిచేస్తున్నది. ఇక మరికొంత మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇక హైదరాబాదు వచ్చి ఉద్యోగాలు వెతుక్కోవలసిన అవసరం ఇంజనీరింగ్ విద్యార్థులకు తప్పినట్లే.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









