ఆఫ్గాన్ పేలుళ్ళను ఖండించిన బహ్రెయిన్
- September 08, 2016
మనామా: ఆఫ్గనిస్తాన్లోని కాబూల్లో ఇటీవల సంభవించిన బాంబు పేలుళ్ళను బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. తీవ్రవాదులు బాంబు పేలుళ్ళతో కాబూల్పై విరుచుకుపడ్డ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బహ్రెయిన్ తీవ్రంగా స్పందించింది. ఆప్ఘనిస్తాన్కి తమ నుంచి నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుందని ఈ సందర్భంగా బహ్రెయిన్, సందేశం పంపింది ఆఫ్ఘనిస్తాన్కి. తీవ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది. తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, అంతర్జాతీయ వేదికలపై తామూ తీవ్రవాదాన్ని ఖండిస్తూనే ఉన్నామని బహ్రెయిన్ పేర్కొంది. తీవ్రవాదం మానవాళికి పెను శాపంగా మారిందని బహ్రెయిన్ నాయకత్వం అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









