ద్రాక్షతో మతిమరుపు మాయం
- August 04, 2015
ద్రాక్ష పండు ముఖ్యంగా రెండు రకాల్లో లభిస్తుంది. తెల్ల ద్రాక్ష, నల్లద్రాక్ష. నల్లద్రాక్షతో పోలిస్తే తెల్ల ద్రాక్ష తియ్యగా ఉంటుంది. దీనికి కారణం తెల్ల ద్రాక్షలో గ్లూకోజ్ ఉంటుంది. ఏ ద్రాక్ష తిన్నా అది మన శరీరానిక చాలా ఆరోగ్యాన్నిస్తుంది. ద్రాక్షలో సి విటమిన్తో పాటూ విటమిన్ ఎ, బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు, నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను కాపాడతాయి. ప్రతిరోజూ ద్రాక్ష రసం తీసుకోవడం అనే అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్షలో ఉండే రిస్ అనే పాలీ ఫినాల్ మతిమరుపు రాకుండా చేసి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ద్రాక్షలోన యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి, వైరల్ జ్వరాలు రాకుండా చేస్తాయి. దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలో కూడా ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







