ద్రాక్షతో మతిమరుపు మాయం
- August 04, 2015
ద్రాక్ష పండు ముఖ్యంగా రెండు రకాల్లో లభిస్తుంది. తెల్ల ద్రాక్ష, నల్లద్రాక్ష. నల్లద్రాక్షతో పోలిస్తే తెల్ల ద్రాక్ష తియ్యగా ఉంటుంది. దీనికి కారణం తెల్ల ద్రాక్షలో గ్లూకోజ్ ఉంటుంది. ఏ ద్రాక్ష తిన్నా అది మన శరీరానిక చాలా ఆరోగ్యాన్నిస్తుంది. ద్రాక్షలో సి విటమిన్తో పాటూ విటమిన్ ఎ, బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు, నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను కాపాడతాయి. ప్రతిరోజూ ద్రాక్ష రసం తీసుకోవడం అనే అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్షలో ఉండే రిస్ అనే పాలీ ఫినాల్ మతిమరుపు రాకుండా చేసి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ద్రాక్షలోన యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి, వైరల్ జ్వరాలు రాకుండా చేస్తాయి. దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలో కూడా ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









