పారాలింపిక్స్లో పతక విజేతలకు మోదీ అభినందనలు..
- September 10, 2016
రియో డి జనీరోలో జరుగుతున్న పారాలింపిక్స్లో స్వర్ణం, కాంస్య పతకాలను సాధించిన అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. భారత్ సంతోషంతో ఉప్పొంగిపోతోందన్నారు. స్వర్ణ పతకం సాధించిన మరియప్పన్ తంగవేలు, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్కు మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. మోదీతో పాటు అభినవ్ బింద్రా, విజయ్గోయల్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పలువురు వారిని అభినందించారు.
* వారిద్దరి ఘనతను అభినందిస్తూ.. తంగవేలును స్వర్ణ పతక క్లబ్లో స్వాగతిస్తున్నాం- అభినవ్ బింద్రా
* రియో హైజంప్ విభాగంలో స్వర్ణం, కాంస్యం సాధించిన మరియప్పన్, వరుణ్ సింగ్కు కంగ్రాట్స్.
చరిత్రాత్మక విజయం.. మన అథ్లెట్లను చూసి ఎంతో గర్వంగా భావిస్తున్నా- క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్
* వీరిద్దరూ ఎంతో మంది అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచారు. ఇద్దరికీ అభినందనలు- రియో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్
* 'కమాన్ ఇండియా'.. హైజంప్ విభాగంలో స్వర్ణం, కాంస్యం సాధించిన తంగవేలు, భాటికి అభినందనలు.- అమితాబ్ బచ్చన్
* రియో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షిలను గౌరవించినట్లు వీరిద్దరినీ భారత్ గౌరవిస్తుంది. వారికి ఇచ్చినట్లే ప్రైజ్ మనీని పారాలింపిక్ అథ్లెట్లకు ఇవ్వాలని ఆశిస్తున్నాను- బాక్సర్ విజేందర్ సింగ్
* మరియప్పన్, వరుణ్ సింగ్లకు అభినందనలు- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







