దేశ రాజధాని మెట్రో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం
- September 10, 2016
దేశ రాజధాని దిల్లీ నగరంలో మెట్రో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దిల్లీ మెట్రో రైలు ఛార్జీలను 66శాతం పెంచాలని ప్యానెల్ నివేదికలో సిఫార్సు చేసింది. ఇలా జరిగితే ప్రయాణికులపై ఛార్జీల భారం విపరీతంగా పెరుగుతుంది. ప్యానెల్ సిఫార్సుల ప్రకారం తక్కువ స్థాయిలో ఉన్న ఛార్జీలు పెరగనున్నాయి. టిక్కెట్ ధర ప్రస్తుతం ఉన్న రూ.8 నుంచి రూ.10కి, రూ.30 నుంచి రూ.50కి పెరగొచ్చు. ఛార్జీల నిర్ణయ కమిటీ ఈ మేరకు సిఫార్సులు చేస్తూ నివేదిక పంపించినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం.
కమిటీ సిఫార్సులపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు, పట్టణాభివృద్ధి విభాగం సెక్రటరీ మెట్రో ఛార్జీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డీఎంఆర్సీ చివరగా 2009లో ఛార్జీలను రివైజ్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఛార్జీల మార్పు కోసం దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎల్ మెహతా ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మూడు నెలల పరిశీలన అనంతరం తాజాగా 66శాతం ఛార్జీలు పెంచాలని నివేదిక ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







