దేశ రాజధాని మెట్రో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం
- September 10, 2016
దేశ రాజధాని దిల్లీ నగరంలో మెట్రో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దిల్లీ మెట్రో రైలు ఛార్జీలను 66శాతం పెంచాలని ప్యానెల్ నివేదికలో సిఫార్సు చేసింది. ఇలా జరిగితే ప్రయాణికులపై ఛార్జీల భారం విపరీతంగా పెరుగుతుంది. ప్యానెల్ సిఫార్సుల ప్రకారం తక్కువ స్థాయిలో ఉన్న ఛార్జీలు పెరగనున్నాయి. టిక్కెట్ ధర ప్రస్తుతం ఉన్న రూ.8 నుంచి రూ.10కి, రూ.30 నుంచి రూ.50కి పెరగొచ్చు. ఛార్జీల నిర్ణయ కమిటీ ఈ మేరకు సిఫార్సులు చేస్తూ నివేదిక పంపించినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం.
కమిటీ సిఫార్సులపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు, పట్టణాభివృద్ధి విభాగం సెక్రటరీ మెట్రో ఛార్జీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డీఎంఆర్సీ చివరగా 2009లో ఛార్జీలను రివైజ్ చేసింది. ఈ ఏడాది జూన్లో ఛార్జీల మార్పు కోసం దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎల్ మెహతా ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మూడు నెలల పరిశీలన అనంతరం తాజాగా 66శాతం ఛార్జీలు పెంచాలని నివేదిక ఇచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









