గల్ఫ్‌ బాధిత మహిళల్ని ఆదుకుంటాం--మంత్రి సునీత

- September 13, 2016 , by Maagulf
గల్ఫ్‌ బాధిత మహిళల్ని ఆదుకుంటాం--మంత్రి సునీత

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అక్కడ అనేక అవస్థలు పడుతున్న మహిళలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో చిక్కుకుని వివిధ జిల్లాలకు చెందిన మహిళలు ఇబ్బందులు పడుతున్న వైనంపై టీవీ ప్రసారం చేసిన కథనాలపై ఆమె స్పందించారు. పని కోసం తీసుకెళ్లి.. ఇలా చిత్ర హింసలకు గురిచేయడం బాధాకరమన్నారు. ఈ విషయంపై మంత్రి పల్లె రఘునాథరెడ్డితో చర్చించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి బాధిత మహిళలను స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేస్తానన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com