ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేవారికి ఓ హెచ్చరిక..!
- September 13, 2016
తరచూ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కునేవారు కేన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ట్రాఫిక్ జామ్లో వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము వంటి విషవాయువుల కారణంగా కొన్ని రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ట్రాఫిక్ జామ్లో ఉన్న సమయంలో కారులో ఉన్నవారు తలుపులు మూసివేయడంతో పాటు లోపల ఫ్యాన్లు కూడా ఆపేయాలని, తరచూ హెడ్లైట్లు ఆర్పడం, వేయడం వంటివి చేయకూడదని వారు సూచిస్తున్నారు. కారు ఆగిఉన్న సమయంలో రహదారుల మీద దుమ్ము, పొగ ఫ్యాన్లోకి ప్రవేశించి వారి శరీరంలోకి చొరబడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్లో హారన్ల రొద కారణంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతాయని వారు గుర్తు చేస్తున్నారు.సాధ్యమైనంత వరకూ వాహన కాలుష్యం నుంచి తప్పించుకోగలిగితే కేన్సర్ ముప్పు తగ్గుతుందని వారు వివరించారు. అయితే ట్రాఫిక్ జామ్ వల్ల ఆరోగ్య నష్టం పాదచారుల మరింత ఎక్కువగా ఉంటుందని మరొక పరిశోధనలో వెల్లడైంది.
తాజా వార్తలు
- ఇరాన్కు కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









