బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్

- September 16, 2016 , by Maagulf
బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్

దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న జియో దాడిని తట్టుకోడానికి ఇప్పటికే టెల్కో రంగంలో ఉన్న ప్రధాన కంపెనీలన్నీ భారీ ఆఫర్లు ప్రకటించాయి. జియో ఎంట్రీ తరువాత ఇంటర్నెట్ టారిఫ్ లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. నెలకు రూ.1199 చార్జ్ తో డాటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ తన వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.  దేశంలో ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్, ఉచిత డాటాను ఆఫర్ చేస్తుంది.  బీబీజి కాంబో ప్లాన్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ లో వినియోగదారులకు ఎస్టీడీ కాల్స్ 24 గంటలు ఉచితం, దీంతో పాటు అన్ లిమిటెడ్ డాటా ఆఫర్ అందిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com