విశాల్ తదుపరి చిత్రానికి శ్రీకారం ..
- September 16, 2016
విశాల్ తన 'కత్తిసండై'తో దీపావళి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతూనే తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. భిన్నమైన చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మిష్కిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'తుప్పరివాళన్' అని పేరుపెట్టారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి.23వ తేదీన చిత్రీకరణ ఆరంభం కానుంది. చెన్నైలో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇందులో విశాల్కు జంటగా తొలిసారిగా రకుల్ ప్రీత్సింగ్ నటిస్తున్నారు. సీనియర్ దర్శక, నటుడు భాగ్యరాజ్ ఇందులో కీలకపాత్ర పోషించనున్నారు.తన సొంత బ్యానరైన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానరుపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. అరోల్ కురాలి సంగీతం సమకూర్చుతున్నారు
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







