పింక్ ప్రీమియర్ షో కి హాజరైన సినీ సెలబ్రిటీలు..

- September 16, 2016 , by Maagulf
పింక్ ప్రీమియర్ షో కి  హాజరైన సినీ సెలబ్రిటీలు..

బాలీవుడ్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ , సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం పింక్. లైంగిక దాడికి గురైన అమ్మాయి పాత్రలో తాప్సీ నటించగా, అమితాబ్‌ బచ్చన్‌ న్యాయవాదిగా కనిపించాడు. సెక్సువల్‌ హెరాస్మెంట్‌కి గురైన బాధితురాలి పాత్రను తాప్సీ పోషించింది. అయితే పింక్ చిత్రం తాజాగా విడుదల కాగా ఈ చిత్రానికి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ చిత్రాన్ని చూసేందుకు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పింక్ చిత్రానికి సంబంధించి రీసెంట్ గా ఓ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా ఆ షోకి హాజరైన సినీ సెలబ్రిటీలు తాప్సీ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాక ఆమెతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అల్లు శిరీష్, అడవిశేషు, ఆది, సుధీర్ బాబు,సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సైనా నెహ్వల్ తదితరులు పింక్ ప్రీమియర్ షోకి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com