క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'మార్ముగావో'ను నావికా దళం ప్రారంభించింది...
- September 17, 2016
విశాఖపట్నం తరగతి క్షిపణి విధ్వంసక యుద్ధనౌక 'మార్ముగావో'ను నావికా దళం ప్రారంభించింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధిచేసిన సంగతి తెలిసిందే. పోరాట సామర్థ్యం విషయంలో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధనౌకలతో సరితూగుతుందని నౌకా దళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా చెప్పారు. ముంబయిలో శనివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో.. సునీల్ సతీమణి రీనా దీన్ని ప్రారంభించారు.
అనంతరం తొలిసారిగా అరేబియా సముద్రంలోకి దీన్ని పంపారు. సముద్ర పరీక్షలు పూర్తిచేసుకున్న అనంతరం ఇది లాంఛనంగా నౌకాదళంలో చేరుతుంది. 2020-24ల్లో ఇలాంటి మరో నాలుగు నౌకలను సైతం ఎండీఎల్ అభివృద్ధి చేస్తుంది. విశాఖపట్నం తరగతికి చెందిన వీటిలో మొదటి నౌకను గతేడాది ఏప్రిల్ 20న ప్రారంభించిన సంగతి తెలిసిందే.తాజా నౌకను 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్ఠంగా 30 నాట్ల వేగంలో దూసుకెళ్లేలా సిద్ధంచేశారు. ఉపరితలం-ఉపరితలం, ఉపరితలం- గగనతలం క్షిపణులతోపాటు జలాంతర్గామి విధ్వంసక రాకెట్లనూ దీనిపై నుంచి ప్రయోగించే వీలుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







