సౌదీ అరేబియా లో ఇద్దరు పోలీసులు కాల్చివేత
- September 18, 2016
శనివారం రాత్రి పొద్దుపోయాక సౌదీ అరేబియా యొక్క తూర్పు ప్రాంతం లో ప్రధాన నగరం దమ్మం ప్రాంతంలో ఇద్దరు సౌదీ పోలీసులను కాల్చి చంపేరు. గుర్తు తెలియని ఆగంతకులు చీఫ్ సార్జెంట్ ముసా ఆలీ మొహమ్మద్ అల్ ఖ్ఓబి మరియు సైనికుడు నావాఫ్ మహ్మాస్ అల్ ఓటైబి లను చంపిన తర్వాత అక్కడినుంచి పారిపోయినట్లు స్థానిక అధికారులు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు ఒక ప్రకటనలో తెలిపారు.
దాహరన్ అల్ జుబెయిల్ రహదారికి దగ్గరలో ఉన్న ఖాద్రియ ప్రాంతం కార్లు రిపేర్లు చేసుకొనేందుకు అక్కడ ఉన్న అనేక గ్యారేజీలు ప్రసిద్ధి. ఆ సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసుల మీదకు ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపేరు. పోలీసుల మృతదేహాలను డమ్మామ్ సెంట్రల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పరిశోధన నిర్వహించనున్నారు. మరణించిన పోలీసులతో ఒకరైన అల్ ఖ్ఓబి సోదరుడు మాట్లాడుతూ, ఈ నేరం చేసిన తీవ్రవాదులు తప్పకుండా అరెస్ట్ కాబడతారనే విశ్వాసం తనకు ఉన్నట్లు తెలిపారు." మేము దేవుని నిర్ణయాలు పై ధన్యవాదాలు తెలియచేస్తున్నాం ,నా సోదరుడు దేశ భద్రత కోసం తన విలువైన ప్రాణాన్ని త్యాగం చేశాడు. విధి నిర్వహణలో నెలకొరిగేడని సగర్వంగా భావిస్తున్నామని ," ఆలీ అల్ ఖ్ఓబి ఆదివారం పేర్కొన్నాడు. "నా సోదరుడు వివాహం కాబడి నలుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నాడని , చివరిసారిగా మేము గత సోమవారం ఈద్ అల్ అధా రోజున చూసేమని .అతని గమ్యం శనివారం సాయంత్రం కాబడేసరికి అమరవీరుడుగా మారిపోయాడని కన్నీళ్ల మధ్య గద్గద స్వరంతో ఆయన వాఖ్యానించాడు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









