ఉగ్రవాదుల తూటాలకు మరో సైనికుడు మృతి

- September 20, 2016 , by Maagulf
ఉగ్రవాదుల తూటాలకు మరో సైనికుడు మృతి

జమ్ముకశ్మీర్‌లోని హంద్వారాలోని నౌగామ్‌లో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన భారత జవాను మృతి చెందాడు. మొత్తం ఐదారుగురు ఉగ్రవాదులు భారత సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. అయితే ఉగ్రవాదుల తూటాలు ఓ జవానుకు తగలడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com