హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 115 ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై సేవలు !
- September 20, 2016
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 115 ఏసీ బస్సుల్లో త్వరలోనే వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరో వారం రోజుల్లోనే ఈ వైఫై సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ఏసీ బస్సులు ఎక్కే ప్రయాణికులు మొదటి 25 నిమిషాలు ఉచితంగా వైఫై సేవలు పొందవచ్చని ఆయన చెప్పారు. 25 నిమిషాల తర్వాత కూడా వైఫై వాడాలనుకునే ప్రయాణికులు సాధారణ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ చార్జీలపై బస్సులలో ప్రకటనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఫై సేవలు అందించేందుకు రూరల్ ఇండియా సంస్థ ముందుకు వచ్చిందన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరిన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









