మిస్టర్ ఇండియా-2 రాబోతోంది..!
- September 22, 2016
బాలీవుడ్లో 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా చిత్రం ఇప్పటికీ ఎవర్గ్రీన్ చిత్రమే. అనిల్ కపూర్, శ్రీదేవి, 'మొగాంబో' అమ్రీశ్ పురిలు నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి ఆడిపాడిన 'ఐ లవ్యూ..' పాట ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మెదులుతూనే ఉంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా మిస్టర్ ఇండియా-2 రాబోతోంది. ఇందులోనూ అతిలోక సుందరి శ్రీదేవే నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే శ్రీదేవి ఈ సినిమాకి కావాల్సిన దుస్తులన్నీ డిజైన్ చేయించుకుంటోందని సన్నిహితులు తెలిపారు.సీక్వెల్ విషయమై బోనీ గతేడాదే వెల్లడించారు. మిస్టర్ ఇండియాకి సీక్వెల్ తీయాలనుకుంటున్నామని కానీ శేఖర్ కపూర్ మాత్రం సీక్వెల్ని డైరెక్ట్ చేయరని చక్కటి స్టోరీ కుదిరిన వెంటనే సినిమా ప్రారంభిస్తామని బోనీ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీదేవి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖితో కలిసి నటిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







