ఒమన్ ట్రాన్స్పోర్ట్: క్యాబ్ ఫర్మ్ ఛార్జీల రెగ్యులేషన్
- September 24, 2016
మస్కట్: 1000కి పైగా ట్యాక్సీలు నిర్వహిస్తున్న మవసలాత్ సంస్థ తమ ట్యాక్సీలలో మీటర్ని అలాగే ఛార్జీల్నీ రెగ్యులేట్ చేయనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో 150 ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలు, 300 మాల్ ట్యాక్సీలు, 500 ఆన్ కాల్ ట్యాక్సీలు ఉన్నాయి. మవసలాత్ సిఇఓ అహ్మద్ బిన్ అలి అల్ ములుసి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర&్టతో కలిసి ట్యాక్సీ బిజినెస్ని రెగ్యులేట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఛార్జీలను రెగ్యులేట్ చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలవుతుందనీ, ఖచ్చితమైన చెల్లింపుల ద్వారా వినియోగదారులకు సమస్యలు ఉండవని ఆయన తెలిపారు. ఏకీకృత ఛార్జీల విధానంతో, అక్రమాలకు తావుండదని వివరించారాయన. ట్యాక్సీ డ్రైవర్లు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రయాణీకులు తాము చేసిన ప్రయాణానికి చెల్లిస్తున్న మొత్తానికి బిల్ అడుగుతున్నారు గనుక, ఛార్జీలను రెగ్యులేట్ చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ట్యాక్సీ వినియోగదారులు కూడా మీటర్డ్ ట్యాక్సీల విధానాన్ని ఆహ్వానిస్తున్నారు
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







