సార్క్‌కు అందరూ హాజరవుతారని భావిస్తున్నాం - నవాజ్ షరీఫ్

- September 24, 2016 , by Maagulf
సార్క్‌కు అందరూ హాజరవుతారని భావిస్తున్నాం - నవాజ్ షరీఫ్

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో నవంబర్‌ 9,10వ తేదీల్లో నిర్వహించే సార్క్‌ సమావేశానికి సభ్యులందరూ హాజరౌతారని ఆశిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ పేర్కొన్నారు. ఈ నెల 18న ఉరీలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సార్క్‌ సమావేశానికి భారత్‌ హాజరయ్యే నిర్ణయంపై కొంత సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో నవాజ్‌షరీఫ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. ఇప్పటికే 19వ సార్క్‌ సమావేశం నిర్హహించేందుకు పాక్‌ ఏర్పాట్లలో నిమగ్నమయింది. పాక్‌ ప్రమేయంతోనే ఈ దాడులు జరిగాయని భారత్‌ ఆరోపిస్తుండగా..తమకు ఆ దాడులతో ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేస్తూ వచ్చింది. రెండు దేశాల మధ్య స్తబ్దతనెలకొన్న నేపథ్యంలో సార్క్‌ సమావేశానికి హాజరయ్యే విషయంపై భారత్‌ నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com