సార్క్కు అందరూ హాజరవుతారని భావిస్తున్నాం - నవాజ్ షరీఫ్
- September 24, 2016
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో నవంబర్ 9,10వ తేదీల్లో నిర్వహించే సార్క్ సమావేశానికి సభ్యులందరూ హాజరౌతారని ఆశిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని నవాజ్షరీఫ్ పేర్కొన్నారు. ఈ నెల 18న ఉరీలో భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సార్క్ సమావేశానికి భారత్ హాజరయ్యే నిర్ణయంపై కొంత సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో నవాజ్షరీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి. ఇప్పటికే 19వ సార్క్ సమావేశం నిర్హహించేందుకు పాక్ ఏర్పాట్లలో నిమగ్నమయింది. పాక్ ప్రమేయంతోనే ఈ దాడులు జరిగాయని భారత్ ఆరోపిస్తుండగా..తమకు ఆ దాడులతో ఎటువంటి సంబంధం లేదని కొట్టిపారేస్తూ వచ్చింది. రెండు దేశాల మధ్య స్తబ్దతనెలకొన్న నేపథ్యంలో సార్క్ సమావేశానికి హాజరయ్యే విషయంపై భారత్ నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన విడుదల కాలేదు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









