ఎవరూ స్పృశించని విభిన్నమైన కథ 'ఘటన'..
- September 24, 2016
''ఆడదంటే ఆటబొమ్మ కాదు.. ఆది పరాశక్తి అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. నిత్యా మీనన్ అద్భుతంగా నటించింది'' అన్నారు దర్శకురాలు శ్రీప్రియ. క్రిష్ జె.సత్తార్, నిత్యా మీనన్ జంటగా 'దృశ్యం' ఫేమ్ శ్రీప్రియ దర్శకత్వంలో వీఆర్ కృష్ణ.యం నిర్మించిన సినిమా 'ఘటన'. మలయాళంలో ఘన విజయం సాధించిన '22 ఫీమేల్ కొట్టాయం' చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. శనివారం ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు. అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ''ఎవరూ స్పృశించని విభిన్నమైన కథ ఇది.నర్సు ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లే అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే విషయాల ఆధారంగా శ్రీప్రియ ఈ సినిమా తీశారు.ఇటువంటి మహిళా సినిమాలు తీయడానికి మహిళా దర్శకురాలే కరెక్ట్'' అన్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వీఆర్ కృష్ణ.యం తెలిపారు. నరేశ్, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: మనోజ్ పిళ్లై, పాటలు: అనంత శ్రీరామ్, సంగీతం: అరవింద్ శంకర్, సమర్పణ: బేబీ సంస్కృతి.యం, బేబీ అక్షర.యం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









