మినిస్టర్స్‌ జీతాల్లో 20 శాతం కోత

- September 27, 2016 , by Maagulf
మినిస్టర్స్‌ జీతాల్లో 20 శాతం కోత

రియాద్‌: కింగ్‌ సల్మాన్‌, సీనియర్‌ గవర్నమెంట్‌ అఫీషియల్స్‌ జీతాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాయల్‌ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ప్రకారం మినిస్టర్స్‌ జీతాల్లో 20 శాతం కోత పడుతుంది. షౌరా కౌన్సిల్‌ సభ్యులకు హౌసింగ్‌ మరియు ఫర్నిషింగ్‌ కోసం ఇస్తున్న యాన్యువల్‌ సబ్సిఇడీలో 15 శాతం కోత విధించేలా డిక్రీలో పేర్కొన్నారు. అలాగే, హై ర్యాంకింగ్‌ అధికారులకు కార్లను ఇవ్వడంపైన కూడా సస్పెన్షన్‌ని విధించారు. ల్యాండ్‌లైన్‌, మొబైల్‌ ఫోన్ల ఖర్చులు కూడా మంత్రులు, ఆయా అధికారులే చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభమయ్యే హిజ్రి ఇయర్‌తో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే జీతాల్లో కోత నుంచి సదరన్‌ బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న మిలిటరీ, ఇంటెలిజెన్స్‌, సెక్యూరిటీ ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్న వారికి మినహాయింపు వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com