ఆఫ్గనిస్తాన్ లో దారుణ సంఘటన
- September 27, 2016
పడుకుని ఉన్న 12 మంది సైనికులపై తోటి సైనికులే దాడి చేసి చంపేసిన దారుణ ఘటన ఆఫ్గనిస్థాన్లో చోటుచేసుకుంది. కుందుజ్ నగరంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు ఈరోజు వెల్లడించారు. ఔట్పోస్ట్లోని ఇద్దరు సైనికులు నిద్రిస్తున్న ఇతర సైనికులపై విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. దాడికి పాల్పడిన ఇద్దరు సైనికులకు తాలిబన్లతో సంబంధం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వారు ఘటన అనంతరం అక్కడి నుంచి పారిపోయి తిరుగుబాటుదారులతో కలిసినట్టు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. దీన్ని 'ఇన్సైడర్ ఎటాక్'గా పేర్కొన్నారు. ఆఫ్గనిస్థాన్లో తాలిబన్లు సహా పలు తిరుగుబాటుదారుల గ్రూపులతో ఆఫ్గాన్ ప్రభుత్వ బృందాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









