మరోసారి శ్రీనగర్ లో కాల్పులు

- September 28, 2016 , by Maagulf
మరోసారి శ్రీనగర్ లో కాల్పులు

పాకిస్థాన్ కాల్పులు ప్రారంభించింది. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్‌ పూంఛ్ సెక్టార్‌లో కాల్పులకు తెగబడింది. సాజియాన్ ప్రాంతంలో భారత ఔట్‌పోస్ట్‌లను టార్గెట్ చేస్తూ ఈ కాల్పులకు దిగింది. అటు భారత బలగాలు కూడా కాల్పులకు ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సును భారత్ రద్దు చేయించడంతో దిక్కుతోచని స్థితిలో పాక్ కాల్పులకు తెగబడింది. ఉగ్రవాదులను భారత్‌లోకి అక్రమంగా చొరబడేలా చేసేందుకే పాక్ ఈ కాల్పులకు దిగిందని సైనికవర్గాల ద్వారా తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com