భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది

- September 29, 2016 , by Maagulf
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది

భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా సూచించింది. పీవోకేలోని ఉగ్ర శిబిరాలపై భారత సైనిక ఆపరేషన్ నేపథ్యంలో ఇరు దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. ఉరీ ఘటన అనంతరం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను చైనా నిశితంగా గమనిస్తోంది. చైనాకు భారత్, పాకిస్థాన్ మంచి మిత్రులని, జఠిలమైన కశ్మీర్ అంశాన్నిఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ సూచించింది. ఉప ఖండంలో శాంతికి భారత్, పాక్ సహకరించాలని చైనా కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com