మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా....

- September 30, 2016 , by Maagulf
మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా....

మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా చేస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేశాడు ఓ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ అంతటా హాట్‌టాపిక్ అయ్యింది. విజయ్ సేతుపతి హీరోగా 'ధర్మదురై' అనే చిత్రాన్ని నిర్మించాడు నిర్మాత ఆర్కే సురేశ్. హీరోయిన్ తమన్నా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసులు రాబట్టింది. అయితే విడుదలకు ముందుగానీ, తర్వాత కానీ తమన్నా ప్రమోషన్లలో పాల్గొనలేదట.
ఇప్పుడు 'అభినేత్రి' ప్రమోషన్‌ల్లో తమన్నా హంగామా చేయడంపై సదరు ప్రొడ్యూసర్‌కి కోపం పుట్టుకొచ్చింది. దాంతో ఆ నిర్మాత నడిగర్ సంఘంలో ఈ బ్యూటీపై ఫిర్యాదు చేశాడు.దీనిపై విచారణ జరపాల్సిన నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్‌తో తమన్నా 'కత్తి సందై' సినిమాలో నటిస్తోంది. మరి ఆ ఫిర్యాదుపై విచారణ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తమిళతంబీలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com